కరోనాతో మృతి చెందిన బీహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
- ఫిబ్రవరి 28న సీఎస్గా బాధ్యతలు
- గత నెల 15న కరోనా సంక్రమణ
- సీఎం సంతాపం
అరుణ్ కుమార్ గత నెల 15న కరోనా బారినపడ్డారు. దీంతో పాట్నాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో నిన్న మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మంత్రులు, పలువురు రాజకీయ నాయకులు అరుణ్ కుమార్ మృతికి సంతాపం తెలిపారు.