మంత్రి ఈటల భూకబ్జాలకు పాల్పడ్డారంటూ రైతుల సంచలన ఆరోపణలు
- మెదక్ జిల్లాలో తమ భూములు ఆక్రమించుకున్నారని వెల్లడి
- తన భార్య జమున పేరిట హేచరీస్ నిర్మిస్తున్న ఈటల!
- హేచరీస్ కోసం తమ భూములు కబ్జా చేశారన్న రైతులు
- అధికారులకు ఫిర్యాదు
- విచారణ చేపట్టిన అధికారులు
ఈటల తన భార్య జమున పేరిట జమున హేచరీస్ స్థాపిస్తున్నారని, అందుకోసం దాదాపు 100 ఎకరాల అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారని రైతులు వెల్లడించారు. ఈ భూములను తన భార్య జమున, కుమారుడు నితిన్ పేర్ల మీద అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ రిజిస్ట్రేషన్ చేయించారని వివరించారు. కాగా, రైతుల ఫిర్యాదుపై అధికారులు విచారణ చేపట్టారు.