ఈ విజయం ఎలా వచ్చిందో అర్థం కాలేదు... పిచ్ మారిపోయిందన్న ధోనీ!
- బుధవారం నాడు సన్ రైజర్స్, సీఎస్కే మధ్య మ్యాచ్
- సునాయాసంగా విజయం సాధించిన ధోనీ సేన
- ఈ వికెట్ ఆశ్చర్య పరిచిందన్న ధోనీ
మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోనీ, ఈ విజయం ఇంత సులువుగా ఎలా వచ్చిందో తనకు అర్థం కాలేదని, తమ బ్యాటింగ్ అద్భుతంగా ఉండటంతో పాటు, పిచ్ మారిపోవడమే కారణమని భావిస్తున్నానని అన్నారు. ఢిల్లీలో తయారు చేసిన వికెట్ తనను ఎంతగానో అశ్చర్యపరిచిందని, ఇటువంటి వికెట్ లభిస్తుందని ఊహించలేదని అన్నాడు. ఇక్కడ మంచు లేదని, మంచు కురిసివుంటే 170కి పైగా పరుగుల ఛేదన కష్టమయ్యేదని అభిప్రాయపడ్డాడు. ఇదే సమయంలో తమ ఓపెనింగ్ భాగస్వామ్యం ఎక్కువగా ఉండటంతో, ఆపై లక్ష్యం ఏ ఓవర్ లోనూ కష్టంగా అనిపించలేదని పేర్కొన్నారు.