కొవిషీల్డ్ వ్యాక్సిన్ ధరలు తగ్గించిన సీరం సంస్థ
- గతంలో కొవిషీల్డ్ ధర రూ.400
- రాష్ట్రాలకు ఇకపై రూ.300కే ఇస్తామని సీరం ప్రకటన
- తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడి
- కొవిషీల్డ్ ను భారత్ లో ఉత్పత్తి చేస్తున్న సీరం
కొవిషీల్డ్ టీకాను బ్రిటన్ కు చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ప్రముఖ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. భారత్ లో క్లినికల్ పరీక్షల అనంతరం కొవిషీల్డ్ కు అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేశారు. భారత్ లో అమలు చేస్తున్న కరోనా వ్యాక్సినేషన్ లో కొవాగ్జిన్ (భారత్ బయోటెక్) తో పాటు కొవిషీల్డ్ ను కూడా ఇస్తున్నారు.