ట్విట్టర్లో తన పేరిట నకిలీ ఖాతా సృష్టించారని పోలీసులకు ఫిర్యాదు చేసిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ!
- అజిత్ దోవల్ వల్లే ముడిపదార్థాలపై నిషేధం ఎత్తివేత అని నకిలీ ఖాతాలో ట్వీట్
- ఇప్పటి వరకు మొత్తం 98 ట్వీట్లు
- చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
- ఇటీవలే సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన రమణ
కొవిషీల్డ్ టీకా తయారీకి కావాల్సిన ముడిపదార్థాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని ఉద్దేశిస్తూ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటి వరకు 98 సార్లు ఈ నకిలీ ఖాతా నుంచి వివిధ పోస్టులు పెట్టినట్లు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన జస్టిస్ ఎన్వీ రమణ ఇటీవలే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. భారత 48వ సీజేఐగా ఆయన చేత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు.