జగన్ గారూ మీకు చేతులెత్తి మొక్కుతున్నాం... ప్రజల ప్రాణాలు కాపాడండి: సోమిరెడ్డి
- రాష్ట్రంలో తీవ్ర పరిస్థితులు ఏర్పడ్డాయన్న సోమిరెడ్డి
- విజయనగరం ఘటన దురదృష్టకరమని వెల్లడి
- ఇలాంటిదే రేపు ఎక్కడైనా జరగొచ్చని వ్యాఖ్యలు
- సీఎం జగన్ అత్యవసరంగా స్పందించాలని విజ్ఞప్తి
ప్రభుత్వం వెంటనే ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులను విడుదల చేసి, వచ్చినవాళ్లను వచ్చినట్టు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించండి అని చెప్పి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు అని సోమిరెడ్డి వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ గురించి, రాష్ట్రంలో అదనపు మౌలిక సదుపాయాల గురించి కనీసం అరగంటైనా ఆలోచించారా? అని సీఎం జగన్ ను ప్రశ్నించారు.
"మీకు ఓట్లేసి మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజల ప్రాణాలను మీరే తీస్తున్నారు... ఇది క్షమించరాని నేరం. రాష్ట్రంలో ఎప్పుడూ లేనివిధంగా తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ జగన్ గారూ మీకు చేతులెత్తి మొక్కుతున్నాం... అత్యవసరంగా స్పందించి ప్రజల ప్రాణాలు కాపాడండి. ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో గమనించి వాటిలో ఏది మెరుగైనదో వాటిని మన రాష్ట్రంలోనూ అమలు చేయండి" అని వ్యాఖ్యానించారు.