భారత్లో కరోనా ఉద్ధృతిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందన!
- భారత ప్రజలకు నా సంఘీభావం తెలుపుతున్నాను
- కరోనాతో బాధపడుతున్న వారంతా త్వరగా కోలుకోవాలి
- కరోనాపై అందరం కలిసి పోరాడాలి
భారత్పై ఎప్పుడూ మండిపడుతూ వ్యాఖ్యలు చేసే పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ హుస్సేన్ కూడా తాజాగా భారత్లో కరోనా పరిస్థితులపై స్పందిస్తూ కరోనా నుంచి బయటపడాలని కోరుకున్నారు. 'ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజల కోసం ప్రార్థిస్తున్నాము. వారిపై దేవుడు దయచూపాలని కోరుకుంటున్నాము. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి భారత్ త్వరలోనే బయటపడుతుందని ఆశిస్తున్నా'నని చెప్పారు.