కరోనా నేపథ్యంలో పేదలకు ఉచితంగా కేంద్రం ఆహార ధాన్యాల పంపిణీ
- దేశంలో మహోగ్రంగా కరోనా వ్యాప్తి
- 3 లక్షలు దాటిన రోజువారీ కేసుల సంఖ్య
- ఉపాధి లేక పేదల బాధలు
- 80 కోట్ల మందికి 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు
- రూ.26 వేల కోట్లు ఖర్చు చేస్తున్న కేంద్రం
భారత్ లో గతంలో కంటే ఈసారి కరోనా వ్యాప్తి అత్యంత అధికంగా నమోదవుతోంది. రోజువారీ కేసుల సంఖ్య 3 లక్షలకు పైన నమోదు కావడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. మరణాల సంఖ్య కూడా వేలల్లో ఉంటోంది. బెడ్లు దొరక్క, ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత లేక పలు ప్రాంతాల్లో దయనీయంగా మరణిస్తున్నారన్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.