Alapati Raja: ఎన్నారై ఆసుపత్రి చైర్మన్ ను బెదిరించారంటూ టీడీపీ నేత ఆలపాటి రాజాపై కేసు నమోదు

Police case filed on TDP leader Alapati Raja
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నారై ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ ను బెదిరించారంటూ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పై కేసు నమోదు అయింది. మంగళగిరి రూరల్ పోలీసులు ఆయనపై 506, 448, 170-2021 సెక్షన్లు నమోదు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న ఎన్నారై మెడికల్ కాలేజి, జనరల్ ఆసుపత్రికి సంబంధించిన వివాదమే ఈ కేసుకు కారణం.

ఆలపాటి రాజేంద్రప్రసాద్ సోదరుడు రవి గతంలో ఎన్నారై పాలకవర్గంలో సభ్యుడిగా ఉన్నారు. అయితే పాలకవర్గంలో విభేదాలు తలెత్తడంతో రవిని డైరెక్టర్ పదవి నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో, రవిని తిరిగి పదవిలోకి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆలపాటి రాజేంద్రప్రసాద్ తనను బెదిరించారని నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ మంగళగిరి (రూరల్) పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చంపుతానని హెచ్చరించారని, ఆసుపత్రిలో బీభత్సం సృష్టించారని ఆరోపించారు. దాంతో పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Go Back to Shorts
Alapati Raja
Case
Police
NRI Hospital
Chairman

More Telugu News