ఇజ్రాయెల్లో మునుపటి స్వేచ్ఛ.. అక్కడిక మాస్కులు లేకుండా తిరిగేయొచ్చు!
- తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్న ఆదేశాలు రద్దు
- దేశంలో సగం జనాభాకు పైగా టీకా
- ఇజ్రాయెల్పై కురుస్తున్న ప్రశంసలు
- ప్రపంచానికి తాము మార్గదర్శకులమయ్యామన్న బెంజమిన్ నెతన్యాహు
ఇజ్రాయెల్లో ఇప్పటికే 60 శాతం మందికిపైగా టీకా తొలిడోసు తీసుకోగా, 56 శాతం మంది రెండు డోసునూ తీసుకున్నారు. అయితే, 16 ఏళ్లలోపు వారిని టీకాల నుంచి మినహాయించారు. మాస్కులు ధరించాలన్న ఆదేశాలను రద్దు చేసిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. వైరస్ను ఎదుర్కోవడంలో మిగతా దేశాలకు తాము మార్గదర్శకులమయ్యామని పేర్కొన్నారు.