6,27,906 మంది రైతులకు వడ్డీ రాయితీని జమ చేసిన సీఎం జగన్
- రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీ అందించాం
- మా ప్రభుత్వానికి రైతులు, రైతు కూలీలే ముఖ్యం
- గత ప్రభుత్వ హయాంలోని బకాయిలను కూడా చెల్లించాం
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ప్రపంచంలో 60 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి రైతులు, రైతు కూలీలు చాలా ముఖ్యమని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోని బకాయిలను కూడా చెల్లించామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంతో మేలు జరుగుతోందని అన్నారు. వచ్చే నెలలో మరో విడత రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పారు.