ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు పురుషులు, మహిళల టీంకు బీసీసీఐ ఓకే!
- 2028 ఒలింపిక్స్ పై సూత్రప్రాయ నిర్ణయం
- రోస్టర్ లో చేరిస్తే ఆడిస్తామని కామెంట్
- కామన్ వెల్త్ గేమ్స్ లో తలపడేందుకు మహిళల టీంకు గ్రీన్ సిగ్నల్
దాంతో పాటు మహిళల టీంకు సంబంధించి షెడ్యూల్ నూ ఖరారు చేసింది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడేందుకు నిర్ణయించింది. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ నకు సన్నాహకంగా న్యూజిల్యాండ్ తో మరో సిరీస్ ను ఆడేందుకు ఓకే చెప్పింది. ఇక, గత ఏడాది జరిగినట్టే మూడు జట్లతో మహిళల ఐపీఎల్ నిర్వహించేందుకు డిసైడ్ అయింది.
ఆ తర్వాత వెంటనే ఇంగ్లండ్ లో సిరీస్ ఆడనుంది. తిరిగొచ్చాక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆడుతుంది. ఆ సిరీస్ పూర్తవ్వగానే ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాతో, ఆ తర్వాత న్యూజిలాండ్ తో ద్వైపాక్షిక లేదా త్రైపాక్షిక సిరీస్ ను మహిళల టీం ఆడనుంది. దాంతో పాటు పూర్తి స్థాయి డొమెస్టిక్ క్రికెట్ మ్యాచ్ లను ఆడేందుకు బీసీసీఐ క్యాలెండర్ ను సిద్ధం చేసింది.