భారత్లో ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించిన అలీకి పదేళ్ల జైలు!
- ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు
- 2016లో భారీ ఆయుధాలతో పట్టుబడ్డ బహదూర్ అలీ
- ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు ప్రణాళికలు
- 2017లో ఓ ఎన్కౌంటర్లో హతమైన మరో ఇద్దరు ముష్కరులు
వీరంతా ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు 2017 జనవరిలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అలీపై అభియోగ పత్రం దాఖలు చేసింది. ఇదే ఉగ్రకుట్రలో భాగమైన మరో ఇద్దరు పాకిస్థానీ తీవ్రవాదులు 2017 ఫిబ్రవరిలో జరిగిన ఓ ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఉగ్రవాదులకు సాయం అందించిన కొంతమంది కశ్మీరీలను కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేసి చార్జిషీట్ దాఖలు చేసింది.