Mahipal Reddy: మందు కొట్టిన ఉన్మాది చర్యకు... కేపీహెచ్బీ ఏఎస్ఐ మహీపాల్ రెడ్డి కన్నుమూత!

  • ఈ నెల 27న గాయపడ్డ మహీపాల్ రెడ్డి
  • మద్యం తాగి వస్తూ ఢీ కొట్టిన క్యాబ్ డ్రైవర్
  • ఈ ఉదయం ఆసుపత్రిలో కన్నుమూత
ASI Mahipal Reddy Who Face Injuries in Drunking Drive Testing Died Today

డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ, ఓ ఉన్మాది చేసిన చర్యకు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ ఏఎస్ఐ మహీపాల్ రెడ్డి కన్నుమూశారు. ఈ నెల 27న నిజాంపేట రహదారిపై డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న సమయంలో, అప్పటికే మందు కొట్టి, అదే రహదారిపై వస్తున్న ఓ క్యాబ్ డ్రైవర్ అతన్ని ఢీకొట్టాడు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహీపాల్ రెడ్డిని, ఆసుపత్రికి తరలించినా, ఆయన ప్రాణాలు మిగల్లేదు. ఈ ఉదయం పరిస్థితి విషమించి ఆయన మరణించారు. మహీపాల్ రెడ్డి అవయవాలను దానం చేయాలని కుటుంబీకులు నిర్ణయించారు. ఆయన అంత్యక్రియలు నేటి సాయంత్రం స్వగ్రామంలో జరుగనున్నాయి. మహీపాల్ మరణంపై పోలీసు శాఖ ఉన్నతాధికారులు సంతాపం తెలిపారు.

More Telugu News