Andhra Pradesh: ఏపీకి నాలుగు రోజుల పాటు వర్ష సూచన

  • ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలలో భారీ వర్షం కురిసే అవకాశం
  • కోస్తా, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు
  • కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం
4 days rain alert for Andhra Pradesh

మండుటెండలతో బెంబేలెత్తుతున్న ఏపీకి కొంత ఉపశమనం కలగనుంది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంద్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

More Telugu News