Corona Virus: ఏపీలో మరోసారి భారీ సంఖ్యలో కరోనా కేసులు

  • గత 24 గంటల్లో 31,325 కరోనా పరీక్షలు
  • 997 మందికి పాజిటివ్
  • చిత్తూరు జిల్లాలో 181 కొత్త కేసులు
  • అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 4 కేసులు
  • రాష్ట్రంలో ఐదుగురి మృతి
Corona new cases number increases in Andhra Pradesh

ఏపీలో కరోనా మరోసారి కమ్మేస్తోంది. కొత్త కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 31,325 కరోనా పరీక్షలు నిర్వహించగా, 997 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జిల్లాల్లో కొత్త కేసులు వందల్లో వస్తున్నాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 181 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 152, విశాఖ జిల్లాలో 139, కృష్ణా జిల్లాలో 110 కరోనా కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 4 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 282 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 8,99,812 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,86,498 మందికి కరోనా నయమైంది. ఇంకా 6,104 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 7,210కి పెరిగింది.

More Telugu News