england: చివ‌రి వ‌న్డే: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌

  • మ‌హారాష్ట్ర‌లోని పూణె వేదికగా వ‌న్డే
  • 1-1తో స‌మంగా ఉన్న ఇరు జ‌ట్లు‌
  • ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌ స్థానంలో భార‌త్ న‌ట‌రాజన్‌కు చోటు
england wins toss

మ‌హారాష్ట్ర‌లోని పూణె వేదికగా భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య చివ‌రి వ‌న్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్  ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఏ జ‌ట్టు గెలిస్తే ఆ టీమ్‌ సిరీస్ ను కైవసం చేసుకోవ‌చ్చు. తొలి వ‌న్డేలో భార‌త్ గెల‌వ‌గా, రెండో వ‌న్డేలో ఇంగ్లండ్ గెలిచిన విష‌యం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌ స్థానంలో భార‌త్ న‌ట‌రాజన్‌కు చోటు క‌ల్పించింది. భారత్ జ‌ట్టులో శిఖ‌ర్‌ ధావన్, శార్దుల్ ఠాకూర్‌, హార్దిక్ పాండ్యా, విరాట్‌ కోహ్లి, రోహిత్ శర్మ, న‌ట‌రాజ‌న్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, పంత్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్, కేఎల్‌ రాహుల్, కృనాల్ ఉన్నారు.

More Telugu News