Kadapa District: రైల్వేకోడూరు టోల్ ప్లాజా దగ్గర దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం

  • కడప జిల్లాలో విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులు
  • రైల్వేకోడూరు టోల్ ప్లాజా వద్ద ఘటన
  • ఆందోళనకు దిగిన హిందూ సంఘాలు
God Idols vandalised in Kadapa District

ఏపీలోని హిందూ దేవాలయాలపై వరుసగా జరిగిన దాడులు కలకలం రేపిన సంగతి తెలిసిందే. పలు ఉద్రిక్త ఘటనల తర్వాత, కొంత కాలంగా దాడులు ఆగిపోయాయి. తాజాగా మరోసారి దేవుళ్ల విగ్రహాలను దుండగులు ధ్వంసం చేయడం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఘటన కడప జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే, రైల్వేకోడూరు టోల్ ప్లాజా వద్ద ఉన్న విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. రాముడు, సీతతో పాటు ఆంజనేయస్వామి విగ్రహాలను నాశనం చేశారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే రైల్వేకోడూరులో హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. మరోవైపు ఘటన నేపథ్యంలో ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

More Telugu News