Agri Gold: గుండెపోటుతో అగ్రిగోల్డ్ డైరెక్టర్ అవ్వా భాస్కరరావు మృతి 

  • గుండెపోటుతో కుప్పకూలిన భాస్కరరావు
  • ఆసుపత్రికి తరలించే సరికే మృతి
  • ఏళ్లు గడుస్తున్నా తేలని కేసు
Agri Gold Director Died with Heart Attack

ఆకర్షణీయమైన వడ్డీలు చెల్లిస్తామంటూ 8 రాష్ట్రాలకు చెందిన దాదాపు 32 లక్షల మంది నుంచి రూ. 6.5 వేల కోట్ల డిపాజిట్ సేకరించిన అగ్రిగోల్డ్ సంస్థ వారందరినీ ముంచింది. ఏళ్లు గడుస్తున్నా ఈ కేసు ఇంకా తేలలేదు. బాధితులకు న్యాయం జరగలేదు. తాజాగా ఈ సంస్థ డైరెక్టర్ అవ్వా ఉదయభాస్కరరావు (56) నిన్న గుండెపోటుతో మృతి చెందారు. గుండె నొప్పితో కుప్పకూలిన ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

అగ్రిగోల్డ్ డిపాజిట్ల కేసులో ఆ సంస్థ డైరెక్టర్లను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే, ఆ తర్వాత వారు బెయిలుపై బయటకు వచ్చారు. కాగా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, తెలంగాణలో అగ్రిగోల్డ్‌కు ఉన్న దాదాపు రూ. 4,109 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది.

More Telugu News