పాకిస్థాన్ లో దారుణం.. బార్బర్ షాపుకు వెళ్లిన హిందూ జర్నలిస్టు కాల్చివేత
- సింధ్ ప్రావిన్స్ లోని సుక్కూర్ లో ఘటన
- వాహనాల్లో వచ్చిన దుండగులు
- జర్నలిస్టుపై విచక్షణ రహితంగా కాల్పులు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన జర్నలిస్టు
అజయ్ లాల్వానీ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు చెబుతుండగా, తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడికి ఎవరితోనూ శత్రుత్వంలేదని అంటున్నారు. అజయ్ హత్యను హిందూ ప్రజాప్రతినిధి లాల్ చంద్ హల్హీ ఖండించారు. ఈ ఘటన తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్నారు. అటు, పాత్రికేయ సంఘాలు కూడా అజయ్ హత్యపై తీవ్రంగా స్పందించాయి. పాత్రికేయులు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు.