విశాఖ ఉక్కును ఖతం చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశం: లోక్సభలో రామ్మోహన్ నాయుడు
- ప్రైవేటు వ్యక్తులకు ఇస్తామన్న భరోసా ప్రభుత్వ సంస్థలకు ఎందుకివ్వరు?
- పార్లమెంటరీ స్థాయీ సంఘం చేసిన సిఫార్సు ఇంకా పెండింగులోనే
- సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడండి
విశాఖ ఉక్కుకు ప్రభుత్వ గనులు కేటాయించాలని 2007లో పార్లమెంటరీ స్థాయీ సంఘం చేసిన సిఫార్సు ఇప్పటికీ పెండింగులోనే ఉందన్నారు. ఇప్పటికైనా విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలని ఎంపీ డిమాండ్ చేశారు. సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ప్రతీ రాష్ట్రానికి ప్రతి అంశంలోనూ కొంత సమయం ఇవ్వాలని రామ్మోహన్నాయుడు కోరారు.