జగన్ కు ఏమాత్రం నైతిక విలువలున్నా చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి: వర్ల రామయ్య
- అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు సీఐడీ నోటీసులు
- హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
- 4 వారాలపాటు వర్తించేలా స్టే ఇచ్చిన హైకోర్టు
- జగన్ పై ధ్వజమెత్తిన వర్ల రామయ్య
- జగన్ ఆత్రుత సరైంది కాదని కోర్టు తేటతెల్లం చేసిందని వ్యాఖ్యలు
కాగా, ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ... చంద్రబాబుకు నోటీసులు పంపింది. ఈ నెల 23న విజయవాడలో విచారణకు రావాలని స్పష్టం చేసింది. సీఐడీ నోటీసులపై చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం నాలుగు వారాలు స్టే ఇచ్చింది. అప్పటివరకు సీఐడీ విచారణను నిలుపుదల చేస్తూ ఆదేశాలిచ్చింది.