జైలు తప్పదని మేం ఏ సోషల్ మీడియా సంస్థ ఉద్యోగులను బెదిరించలేదు: కేంద్రం
- సోషల్ మీడియా సంస్థలపై కేంద్రం అసంతృప్తి
- భారత చట్టాలకు లోబడే కార్యకలాపాలు సాగించాలని స్పష్టీకరణ
- భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందేనని ఉద్ఘాటన
- ప్రకటన చేసిన ఐటీ మంత్రిత్వ శాఖ
అయితే, సోషల్ మీడియా వేదికలన్నీ భారతీయ చట్టాలకు లోబడే కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుందని, భారత రాజ్యాంగాన్ని గౌరవించడం తప్పనిసరి అని పేర్కొంది. ఇతర వ్యాపార రంగాలు ఏ విధంగా భారత వ్యవస్థల అదుపాజ్ఞల్లో ఉన్నాయో, ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సోషల్ వేదికలు కూడా అదే రీతిలో నడుచుకోవాలని ఐటీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వివరించింది.