Corona Virus: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు... చిత్తూరు జిల్లాలో ఏకంగా 60 కేసుల నమోదు!

  • 24 గంటల్లో 174 కేసుల నమోదు
  • చిత్తూరు జిల్లాలో ఇద్దరు మృతి
  • రాష్ట్రంలో ప్రస్తుతం 1,158 యాక్టివ్ కేసులు
Corona cases in AP increasing again

ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. గత 24 గంటల్లో 47,803 మందికి కోవిడ్ టెస్టులు చేయగా 174 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో 60, కృష్ణా జిల్లాలో 26, విశాఖ జిల్లాలో 23 మంది కరోనా బారిన పడ్డారు. విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో 78 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. చిత్తూరు జిల్లాలో ఇద్దరు వ్యక్తులు మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,91,178కి చేరుకుంది. మొత్తం 8,82,841 మంది డిశ్చార్జ్ అయ్యారు. 7,179 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,158 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

More Telugu News