Telangana: తెలంగాణలో కొత్తగా 158 కరోనా కేసులు

Media Bulletin on status of positive cases COVID19 in Telangana
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,900
  • మృతుల సంఖ్య 1,640
  • జీహెచ్ఎంసీలో కొత్త‌గా 30 క‌రోనా కేసులు  
తెలంగాణలో కొత్త‌గా 158 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒక్క‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 207 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,900కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,96,373 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,641 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,886 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 748 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 30 క‌రోనా కేసులు నమోద‌య్యాయి.

             
Telangana
Corona Virus
COVID19

More Telugu News