హెరిటేజ్ పరువు నష్టం కేసులో.. మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబులపై నాన్ బెయిలబుల్ వారెంట్

NBW issues against minister Kannababu and MLA Ambati Rambabu in Heritage case
ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబులపై నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ అయింది. కన్నబాబు, అంబటి హెరిటేజ్ సంస్థ పరువునష్టం కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో వారెంట్ జారీ చేశారు. ఈ మేరకు ప్రజాప్రతినిధుల కోర్టు నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణ ఈ నెల 24కి వాయిదా వేసింది.

గతంలో హెరిటేజ్ సంస్థపై కన్నబాబు, అంబటి వ్యాఖ్యలు చేశారంటూ ఆ సంస్థ పరువునష్టం దావా వేసింది. దీనికి సంబంధించిన విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో జరుగుతుండగా, వైసీపీ నేతలు విచారణకు హాజరుకాలేదు. గతంలో కూడా ఒకటి.. రెండు సార్లు కోర్టు హెచ్చరించినా  ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలోనే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు అర్థమవుతోంది.
Go Back to Shorts
NBW
Kannababu
Ambati Rambabu
Heritage Case
Andhra Pradesh

More Telugu News