కాణిపాకం ఆల‌యానికి రూ.7 కోట్ల విరాళ‌మిచ్చిన ప్ర‌వాస భార‌తీయుడు!

nri gives donation for kanipakam temple
  • ఈ రోజు ఉద‌యం చెక్ అంద‌జేత‌
  • త‌న పేరు చెప్పొద్ద‌న్న దాత‌
  • ఆల‌య పున‌ర్నిర్మాణం కోసం విరాళం
ప్రవాస భారతీయడు చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం భూరి విరాళం ఇచ్చారు. అయితే, త‌న పేరును  చెప్పేందుకు ఆయ‌న అంగీక‌రించ‌లేదు. ఈ రోజు ఉదయం ఆలయ ఈవో ఎ.వెంకటేశ్‌కు ఆయ‌న రూ.7 కోట్ల విరాళం ఇచ్చారు.

ఆ ఆలయ పునర్నిర్మాణ ప‌నుల‌కు మొత్తం రూ.8.75 కోట్ల ఖర్చు అవుతుందని ఇప్ప‌టికే ఇంజ‌నీర్లు అంచనా వేశారు. ఈ విష‌యాన్ని తెలుసుకున్న ఓ ప్ర‌వాస భార‌తీయుడు ఆ నిర్మాణ వ్యయం మొత్తాన్ని తానే ఇస్తానని ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో మొదటి విడతగా ఇవాళ రూ.7 కోట్లు ఇచ్చారని ఈవో వెంక‌టేశ్ తెలిపారు.

ఈ రోజు ఉద‌యం ఆల‌యానికి వ‌చ్చిన‌ దాతతో పాటు ఆయ‌న‌ కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో  అధికారులు స్వాగతం పలికారు. స్వామివారికి ప్ర‌త్యేక పూజ‌లు చేసి, దాత కుటుంబ స‌భ్యుల‌కు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Go Back to Shorts
kanipakam
temple

More Telugu News