Elephant: ఏనుగును హింసిస్తున్న వీడియో వైరల్... సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు

  • శ్రీవిల్లిపుత్తూరు ఆలయంలో ఏనుగుపై హింస
  • చెట్టుకు కట్టేసి కొట్టిన వైనం
  • చలించిపోయిన జంతుప్రేమికులు
  • స్పందించిన హిందూ రెలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ అధికారులు
Video contains violence on Elephant got huge attention

తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ ఆలయంలో జయమాల్యత అనే ఏనుగు సేవలందిస్తోంది. ఇది 19 ఏళ్ల వయసున్న ఆడ ఏనుగు. అయితే ఈ ఏనుగు చెప్పిన మాట వినడంలేదంటూ మావటీలు శివప్రసాద్, వినీల్ కుమార్ దాన్ని తీవ్రంగా హింసిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏనుగును ఓ చెట్టుకు కట్టేసి దాన్ని విచక్షణ రహితంగా కొడుతున్న దృశ్యాలను నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. అంతటి ఏనుగు సైతం ఆ దెబ్బలకు తట్టుకోలేక మూగగా భరించిన వైనం ఆ వీడియో చూసిన వాళ్లను కలచివేసింది.

దీనిపై జంతు ప్రేమికులు ఎలుగెత్తిన నేపథ్యంలో హిందూ రెలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ విభాగం అధికారులు స్పందించారు. ఆ వీడియోను తాము కూడా చూశామని, ఏనుగుపై దాష్టీకం చేసిన మావటీలపై చర్యలు తీసుకునే అంశం పరిశీలనలో ఉందని అధికారులు వెల్లడించారు.

More Telugu News