టీస్టాల్ వద్ద ఇద్దరు పోలీసులను కాల్చి చంపిన టెర్రరిస్టు
- జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో దారుణం
- పోలీసులపై కాల్పులు జరిపి పరారైన ఉగ్రవాది
- మూడు రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన
ఈ కాల్పుల్లో సొహైల్ అనే కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందగా... మహ్మద్ యూసుఫ్ అనే మరో కానిస్టేబుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. విమానాశ్రయం రోడ్డులో ఉండే బఘాల్ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉగ్రవాది కాల్పులకు తెగబడటం కలకలం రేపింది.
కాల్పుల ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. టెర్రరిస్టు కోసం ముమ్మర గాలింపును చేపట్టాయి. మూడు రోజుల వ్యవధిలో కాల్పులు జరగడం ఇది రెండోసారి. గత బుధవారం నాడు దుర్గనాగ్ ప్రాంతంలో ఓ రెస్టారెంట్ యజమాని కుమారుడిపై కాల్పులు జరపగా... గాయాలతో అతను బయటపడ్డారు.