Palla Srinivasarao: చంద్రబాబు ఆదేశాల మేరకు దీక్ష విరమిస్తున్నా: పల్లా శ్రీనివాసరావు

Palla announces he stops hunger strike after Chandrababu advice
షార్ట్స్‌లో చూడండి
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిరసిస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన దీక్ష ముగిసింది. చంద్రబాబు ఆదేశాల మేరకు దీక్ష విరమిస్తున్నట్టు పల్లా వెల్లడించారు. పల్లా ఈ నెల 10 నుంచి విశాఖలో దీక్ష కొనసాగిస్తున్నారు. ఆరోగ్యం క్షీణిస్తుండడంతో ఇవాళ ఉదయం ఆయనను దీక్ష శిబిరం నుంచి పోలీసులు బలవంతంగా కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోనూ దీక్ష కొనసాగించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ చేరుకుని కిమ్స్ లో పల్లా శ్రీనివాసరావును పరామర్శించారు. ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించాల్సిందిగా సూచించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు మీ ప్రయత్నం మీరు చేశారు. కానీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. అందరినీ కలుపుకుని ఈ విషయంలో ముందుకెళ్లాల్సి ఉంటుంది. సమష్టిగా పోరాడాలే తప్ప ఈ అంశంలో ప్రాణత్యాగం పరిష్కారం కాబోదు' అని అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
Palla Srinivasarao
Hunger Strike
Chandrababu
Vizag Steel Plant

More Telugu News