సీన్ రీ-కన్ స్ట్రక్షన్ కోసం నటుడు దీప్ సిద్ధూని ఎర్రకోటకు తీసుకెళ్లిన పోలీసులు
- గణతంత్ర దినోత్సవం రోజున రైతుల ట్రాక్టర్ పరేడ్
- ఢిల్లీ ఎర్రకోట వద్ద అవాంఛనీయ ఘటనలు
- ట్రాక్టర్ పరేడ్ ను దారిమళ్లించాడంటూ దీప్ సిద్ధూపై ఆరోపణలు
- హర్యానాలో అరెస్ట్
ఎర్రకోట వద్ద జరిగిన ఘటనకు దీప్ సిద్ధూనే సూత్రధారి అని బలంగా నమ్ముతున్న పోలీసులు అతడిని హర్యానాలోని కర్నాల్ బైపాస్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అటు, ఇక్బాల్ సింగ్ అరెస్ట్ పై పోలీసులు రూ.50 వేల రివార్డు కూడా ప్రకటించారు. అతడిని పంజాబ్ లోని హోషియార్ పూర్ వద్ద అరెస్ట్ చేశారు. అంతకుముందు దీప్ సిద్ధూ, జుగ్ రాజ్ సింగ్, గురుజ్యోత్ సింగ్, గుర్జంత్ సింగ్ ల ఆచూకీ తెలిపితే లక్ష రూపాయలు ఇస్తామని కూడా పోలీసులు ప్రకటించారు. అసలు, రైతు ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తి అని, ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు రైతులకు వ్యతిరేకంగా కుట్ర పన్నాడని దీప్ సిద్ధూపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.