Mahesh Babu: భారీ స్థాయిలో వెండితెరకు రామాయణం.. శ్రీరాముడి పాత్రలో మహేశ్!

  • మూడు భాగాలుగా రామాయణం నిర్మాణం 
  • 1500 కోట్ల భారీ బడ్జెట్టు కేటాయింపు
  • నితీశ్ తివారి, రవి ఉడయార్ దర్శకత్వం
  • సీతగా దీపిక.. రావణుడిగా హృతిక్  
  • నిర్మాతలుగా అల్లు అరవింద్, మధు మంతెన
Mahesh Babu to play Lord Sri Rama

మన పురాణగాథ రామాయణాన్ని ఎంతోమంది ఎన్నో రకాలుగా వెండితెరపై చూపించారు. ఎన్నిసార్లు తీసినా.. ఏ భాషలో తీసినా..  రామాయణం ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే వుంది. అది ఆ కథలో వున్న గొప్పతనం. అందుకే, రామాయణంని మళ్లీ మళ్లీ తెరకెక్కించే ప్రయత్నాలను మన నిర్మాతలు చేస్తుంటారు. ఇప్పుడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన కలసి ఈ రామాయణకథను భారీ ఎత్తున వెండితెరకు ఎక్కించడానికి ప్రణాళికలు వేశారు.

'దంగల్' వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన నితీశ్ తివారీ, 'మామ్' చిత్ర దర్శకుడు రవి ఉడయార్ కలసి సంయుక్తంగా ఈ ప్రాజక్టుకు దర్శకత్వం వహిస్తారు. మొత్తం మూడు భాగాలుగా హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించడానికి డిజైన్ చేస్తున్నారు. 1500 కోట్ల భారీ బడ్జెట్టుతో ఈ చిత్రాలను అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించడానికి సిద్ధమయ్యారు.

ఇక ఇందులో వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటులు ఆయా పాత్రలను పోషిస్తారు. ఈ క్రమంలో శ్రీరాముడి పాత్రను మహేశ్ బాబు పోషిస్తాడని తాజాగా తెలుస్తోంది. సీతాదేవి పాత్రను దీపిక పదుకొణే పోషించే అవకాశం వుంది. ఇక మరో కీలక పాత్ర రావణుడి పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ధరిస్తాడని సమాచారం.

More Telugu News