ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ
- నిన్న ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్
- పార్లమెంటు ఆవరణలో అమిత్ షాతో సమావేశం
- పవన్ వెంట నాదెండ్ల మనోహర్
- విశాఖ ఉక్కు కర్మాగారం అంశంపై విజ్ఞప్తి!
- తిరుపతి లోక్ సభ అభ్యర్థిపైనా చర్చించే అవకాశం
తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపికపైనా వారు అమిత్ షాతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. తిరుపతిలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించాలని నిర్ణయించారు. మరి ఆ అభ్యర్థి ఎవరన్నది బీజేపీ పెద్దలతో సమావేశాల అనంతరం తేలనుంది. పవన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలిసే అవకాశాలున్నాయి.