విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడి పిటిషన్.. వేలాదిమంది మద్దతు
- చేంజ్ డాట్ ఆర్గ్లో పిటిషన్ ప్రారంభించిన ఎంపీ
- గత రాత్రి 12 గంటల వరకు 31,715 మంది మద్దతు
- లక్ష మంది మద్దతు తెలిపిన అనంతరం ప్రధానికి అందజేత
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాలని ఆ పిటిషన్లో రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఈ పిటిషన్కు లక్ష మంది మద్దతు తెలిపిన అనంతరం దానిని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక, ఉక్కుశాఖ మంత్రులకు అందిస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.