ఏపీ పంచాయతీ... తొలి విడతలో 523 సర్పంచ్ లు ఏకగ్రీవం!
- 9న తొలి విడత ఎన్నికలు
- అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 110 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం
- 1,323 నామినేషన్ల తిరస్కరణ
ఇక తొలి విడతలో ఎన్నికలు జరిగే 12 జిల్లాలను పరిశీలిస్తే, చిత్తూరులో అత్యధికంగా 110 సర్పంచ్ పదవులు ఏగ్రీవమయ్యాయి. ఇదే సమయంలో ఆ జిల్లాలో వార్డుల విషయంలో 2,499 వార్డులకు ఒకే నామినేషన్ చొప్పున దాఖలైంది. అనంతపురం జిల్లాలో అత్యల్పంగా ఆరు పదవులే ఏకగ్రీవం అయ్యాయి. ఇక ఏకగ్రీవం కాని పంచాయతీలు, వార్డులకు 9వ తేదీన పోలింగ్ జరిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.