2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 12.05 లక్షల కోట్ల అప్పు చేస్తాం: నిర్మలా సీతారామన్
- వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 34.83 లక్షల కోట్ల వ్యయం
- ద్రవ్యలోటును పూడ్చేందుకు మార్కెట్ల నుంచి రుణాలు
- పన్నుల ఆదాయంలో 41 శాతం రాష్ట్రాలకు
అలాగే, 15వ ఆర్థిక కమిషన్ ప్రతిపాదనల మేరకు పన్నుల రూపంలో వచ్చిన ఆదాయంలో రాష్ట్రాలకు 41 శాతం వాటా లభిస్తుందని స్పష్టం చేశారు. డిజిటల్ పద్ధతిలో వ్యాపారాలు నిర్వహించే రూ. 10 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు ట్యాక్స్ ఆడిట్ పరిమితి మినహాయింపును రెట్టింపు చేస్తామని నిర్మల వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో ద్రవ్యలోటు 6.8 శాతం నమోదయ్యే అవకాశం ఉందని, 2025-26 ఆర్థిక సంవత్సరానికి దీనిని 4.5 శాతానికి తగ్గించేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు.