బడ్జెట్ ఎఫెక్ట్... భారీ లాభాలతో పరుగులు తీస్తున్న స్టాక్ మార్కెట్లు
- వార్షిక బడ్జెట్-2021 ప్రకటన
- కేంద్రం పథకాలతో మదుపర్లలో ఉత్సాహం
- 1,600 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
- 400 పాయింట్ల మేర వృద్ధి నమోదు చేసిన నిఫ్టీ
- బ్యాంకింగ్ షేర్లకు భారీ లాభాలు
బడ్జెట్ ప్రకటనతో సానుకూల సెంటిమెంట్లు బలపడ్డాయి. సెన్సెక్స్ 1,600 పాయింట్ల వృద్ధి నమోదు చేయగా, నిఫ్టీ కూడా అదే రీతిలో దూసుకుపోయింది. నిఫ్టీ 400 పాయింట్ల మేర లాభపడింది. ఇక కేంద్రం ప్రకటించిన నయా స్క్రాప్ విధానం ఆటోమొబైల్ రంగ షేర్లకు ఊతమిచ్చింది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి.