AP High Court: రేషన్ అందించే వాహనాలపై రాజకీయ నేతల ఫొటోలు, గుర్తులు వద్దు: హైకోర్టు కీలక ఆదేశాలు

  • రేషన్ పంపిణీకి అనుమతి కోరుతూ హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్
  • అనుమతించిన హైకోర్టు
  • కార్యక్రమ వివరాలతో ఎస్‌ఈసీని సంప్రదించాలని ఆదేశం
Remove political party symbols and photos on ration vehicles orders Highcourt

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో ఫిబ్రవరి నుంచి ఇంటింటికీ రేషన్‌ సరఫరా చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అడ్డుకట్ట పడింది. ఈ నేపథ్యంలో రేషన్ పంపిణీకి అనుమతి కోరుతూ హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికల నిబంధనలకు లోబడి వాహనాల ద్వారా రేషన్‌ను పంపిణీ చేసుకోవచ్చని సూచించింది. అయితే, ఆ వాహనాలపై రాజకీయ నేతల ఫొటోలు కానీ, పార్టీ గుర్తులు,  పార్టీ రంగులు కానీ ఉండరాదని ఆదేశించింది. కార్యక్రమ వివరాలతో రెండు రోజుల్లో ఎస్‌ఈసీని సంప్రదించాలని సూచించింది. ఎన్నికల కమిషన్ ఆ తరువాత ఐదు రోజుల్లో తన నిర్ణయం తెలపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

More Telugu News