ఏపీ కరోనా అప్ డేట్: 111 కొత్త కేసులు, ఇద్దరి మృతి
- గత 24 గంటల్లో 33,808 కరోనా టెస్టులు
- అత్యధికంగా కృష్ణా జిల్లాలో 19 కేసులు
- ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులు నిల్
- యాక్టివ్ కేసుల సంఖ్య 1,369
అదే సమయంలో 97 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,87,349 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,78,828 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 1,369 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో ఇప్పటిదాకా 7,152 మంది కరోనాతో కన్నుమూశారు.