ఎస్ఈసీ కార్యాలయానికి వెళ్లినా నిమ్మగడ్డను కలవకుండానే వెనుదిరిగిన పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు!
- ఏపీలో పంచాయతీ ఎన్నికలు
- నోటిఫికేషన్ విడుదలకు ఎస్ఈసీ సిద్ధం
- పంచాయతీ అధికారుల సమావేశం ఏర్పాటు
- గైర్హాజరైన అధికారులు
- మెమో జారీ చేసిన ఎస్ఈసీ
దాంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మెమో జారీ చేశారు. అనంతరం, ఎస్ఈసీ కార్యాలయానికి వచ్చిన గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ అక్కడే ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను కలవకుండానే తిరిగి వెళ్లారు. ప్రభుత్వం తరఫున లేఖను నిమ్మగడ్డ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ కు అందజేసి వెళ్లిపోయారు.