Pawan Kalyan: వెంగయ్యనాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్ కల్యాణ్

  • 23న వెంగయ్యనాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్
  • కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించనున్న జనసేనాని
  • జిల్లా ఎస్పీని  కలిసే అవకాశం
Pawan Kalyan to meet Vengaiah Naidu family

ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన వెంగయ్యనాయుడు కుటుంబాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. ఈ నెల 23న పరామర్శించనున్నట్టు జనసేన ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు చేసిన అవమానాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్న బండ్ల వెంగయ్యనాయుడు కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్టు తెలిపింది.

ఈ నెల 22న పవన్ తిరుపతి నుంచి బయలుదేరి సాయంత్రం 6 గంటలకు ఒంగోలు చేరుకుంటారని... 23న కుటుంబాన్ని పరామర్శిస్తారని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్, ఇతర నేతలు కూడా పాల్గొంటారని తెలిపారు. జిల్లా ఎస్పీని కలిసి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరే అవకాశం కూడా ఉందని వివరించారు.

More Telugu News