భారత్-ఆస్ట్రేలియా టెస్టును అడ్డుకున్న వరుణుడు
- తొలి ఇన్నింగ్స్ లో 369 పరుగులకు ఆలౌట్ అయిన ఇండియా
- 44 పరుగులతో దూకుడుగా ఆడి ఔటైన రోహిత్
- భారత్ 62 పరుగుల వద్ద ఉండగా అడ్డుకున్న వర్షం
భారత్ బ్యాటింగ్ ఆరంభించిన కాసేపటికే గిల్ వికెట్ ను భారత్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్ లో స్లిప్ లో ఉన్న స్మిత్ చేతికి గిల్ చిక్కాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ తనదైన శైలిలో ఆడాడు. 74 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేశాడు. పుజారాతో కలిసి రెండో వికెట్ కు 49 పరుగులు జోడించాడు. అయితే హాఫ్ సెంచరీకి దగ్గరైన తరుణంలో ఔట్ అయ్యాడు. లైయన్ బౌలింగ్ లో భారీ షాట్ కొట్టేందుకు యత్నించి మిచెల్ స్టార్క్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత రహానే క్రీజులోకి వచ్చాడు. పుజారా, రహానె జాగ్రత్తగా ఆడుతున్న సమయంలో వర్షం అడ్డంకిగా మారింది.