Bonda Uma: ఓపక్క దాడులు చేస్తూ.. గోవులకు పూజలు చేస్తే పాపం పోతుందా?: బోండా ఉమ

Bonda Uma fires on YSRCP
విజయవాడ కనకదుర్గ ఆలయంలో గోపూజ నిర్వహించడంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం ఓట్ల కోసమే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దేవాలయాలు, విగ్రహాలపై దాడులు చేయిస్తూ... గోవులకు పూజలు చేస్తే పాపం పోతుందా? అని ప్రశ్నించారు.

దేవాలయాలపై ఇన్ని దాడులు జరిగినట్టు చరిత్రలో ఎక్కడా లేదని ఉమ అన్నారు. వైసీపీ ప్రభుత్వ మద్దతుతోనే ఇన్ని దాడులు జరిగాయని ఆరోపించారు. ఇన్ని దాడులు జరిగినా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని దుయ్యబట్టారు. దుండగులకు వైసీపీ మద్దతు ఉండటం వల్లే అరెస్టులు జరగలేదనే విషయం నిజమా? కాదా? చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాల్లో సమర్థవంతంగా పని చేసిన పోలీసులు ఇప్పుడు ఎందుకు సక్రమంగా పని చేయడం లేదని ప్రశ్నించారు.
Bonda Uma
Telugudesam
Jagan
YSRCP

More Telugu News