దుబాయ్ లో మహేశ్ బాబు తాజా చిత్రం షూటింగ్?
- మహేశ్ తాజా చిత్రం 'సర్కారు వారి పాట'
- బ్యాంక్ కుంభకోణాల నేపథ్యంలో సాగే కథ
- ఈ నెల 25 నుంచి దుబాయ్ లో షూటింగ్
- ఇరవై రోజుల పాటు కొనసాగే షెడ్యూలు
ఈ క్రమంలో తొలి షెడ్యూలును హైదరాబాదులోనే ప్రారంభిస్తారంటూ ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, తాజాగా, తొలి షెడ్యూలును దుబాయ్ లో నిర్వహించడానికి దర్శక నిర్మాతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నెల 25 నుంచి దుబాయ్ లో షెడ్యూలు జరుగుతుందని అంటున్నారు. సుమారు ఇరవై రోజుల పాటు అక్కడే ఈ షెడ్యూలు కొనసాగుతుంది.
అనంతరం రెండో షెడ్యూలు షూటింగును హైదరాబాదులో నిర్వహిస్తారని సమాచారం. బ్యాంక్ కుంభకోణాల నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.