ఎవరికి నీవు జగనన్నవి.. నీవు సీఎం అనే విషయాన్ని గుర్తుంచుకో: బండారు సత్యనారాయణ
- రామతీర్థంపై విచారణకు క్రిస్టియన్ అధికారిని వేశారు
- సునీల్ కుమార్ ఒక అసమర్థ అధికారి
- సంతకాలు లేని పట్టాలను జనాలకు ఇస్తున్నారు
ప్రతి దానికి జగనన్న అని పేరు పెట్టుకుంటున్నారని... ఎవరికి నీవు జగనన్నవి? అని సత్యనారాయణమూర్తి మండిపడ్డారు. నీవు ముఖ్యమంత్రివి అనే విషయాన్ని గుర్తుంచుకో అని అన్నారు. ఎవరి సంతకాలు లేని ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నారని... ఈ పట్టాలకు విలువ ఉందా? అని నిలదీశారు. దీనిపై విశాఖ జిల్లా కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఈ మోసంపై కోర్టుకు వెళ్తామని అన్నారు.