Sake Sailajanath: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్ అరెస్ట్

  • రామతీర్థంకు బయల్దేరిన శైలజానాథ్
  • మార్గమధ్యంలో అరెస్ట్ చేసిన పోలీసులు
  • మతాలను రాజకీయాలకు వాడుకోవడం సరికాదన్న శైలజానాథ్
APCC President Sailajanath arrested

ఏపీలో హిందూ దేవాలయాలు, విగ్రహాల ధ్వంసం ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ప్రభుత్వమే దీనిక బాధ్యత వహించాలని విపక్షాలు అంటుంటే... ఈ ఘటనల వెనుక రాజకీయ కుట్రకోణం ఉందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇప్పటికే ఈ ఘటనలపై టీడీపీ, బీజేపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ ఘటనలపై తమ ఆందోళన వ్యక్తం చేశాయి.

కాంగ్రెస్ పార్టీ ఆందోళనల్లో భాగంగా రామతీర్థంకు బయల్దేరిన పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాల కోసం మతాలను వాడుకోవడం సరికాదని అన్నారు. రామతీర్థం ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మత రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని అన్నారు.

More Telugu News