ఏపీ కరోనా అప్ డేట్: 377 కొత్త కేసులు, 4 మరణాలు
- గత 24 గంటల్లో 51,420 టెస్టులు
- అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 82 కేసులు
- అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 5 కేసులు
- యాక్టివ్ కేసుల సంఖ్య 3,038
అదే సమయంలో 278 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 8,83,587 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,73,427 మంది వైరస్ ప్రభావం నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,038 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 7,122కి చేరింది.