Jagan: గవర్నర్ హరిచందన్ తో సీఎం జగన్ భేటీ

  • ఈ సాయంత్రం రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం జగన్
  • మర్యాదపూర్వకంగా గవర్నర్ ను కలిసిన వైనం
  • నూతన సంవత్సరం సందర్భంగా జ్ఞాపిక బహూకరణ
  • 40 నిమిషాల పాటు గవర్నర్ తో సమావేశం
CM Jagan met AP Governor Biswabhushan Harichandan

ఏపీ సీఎం జగన్ ఇవాళ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. ఈ సాయంత్రం రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం జగన్ గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆయనకు జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా ఇరువురు అనేక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల గురించి కూడా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశం 40 నిమిషాల పాటు సాగింది. గవర్నర్ తో సమావేశం అనంతరం సీఎం నేరుగా క్యాంపు ఆఫీసుకు చేరుకున్నారు.

More Telugu News