నందం సుబ్బయ్య హత్య కేసులో ఐదుగుర్ని అరెస్ట్ చేశాం: ఎస్పీ అన్బురాజన్
- ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య హత్య
- ఏ1గా కుంభా రవి
- రవికి, సుబ్బయ్యకి మధ్య పాత గొడవలున్నట్టు ఎస్పీ వెల్లడి
- ఇటీవల మరోసారి ఘర్షణ జరిగిందని వివరణ
- ఆ ఘర్షణే హత్యకు దారితీసిందన్న ఎస్పీ
కాగా, సుబ్బయ్య హత్యకేసులో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది, మునిసిపల్ కమిషనర్ ల పేర్లను కూడా చేర్చాలని కోరుతూ నారా లోకేశ్ ఆధ్వర్యంలో నిన్న ప్రొద్దుటూరులో ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. దాంతో, కోర్టును సంప్రదించి ఆ ముగ్గురు పేర్లను చేర్చే అంశం పరిశీలిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.