Nara Lokesh: ఆత్మహత్య చేసుకున్న రైతు కృష్ణంరాజు తనయుడ్ని నేను చదివిస్తా: లోకేశ్

  • కృష్ణా జిల్లాలో నారా లోకేశ్ పర్యటన
  • ఏ రైతును కదిపినా కన్నీళ్లేనని వెల్లడి
  • పాగోలులో రైతు కృష్ణంరాజు ఆత్మహత్య
  • కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన లోకేశ్
Lokesh visits farmer Krishnamraju family

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటించారు. నివర్ తుపానుతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆయన ఆత్మీయంగా పరామర్శించారు. ఏ రైతును కదిపినా కన్నీళ్లేనంటూ లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవర్ని పరామర్శించినా కష్టాలే ఏకరవు పెడుతున్నారని వివరించారు. అప్పులు తీర్చలేక, సర్కారు నుంచి సాయం అందక పాగోలుకు చెందిన రైతు కృష్ణంరాజు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని వెల్లడించారు. ఒక అన్నగా కృష్ణంరాజు తనయుడ్ని చదివించే బాధ్యత తీసుకుంటున్నానని లోకేశ్ మాటిచ్చారు.

More Telugu News